తిరుపతి, జూలై: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. కరోనావ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం 9 నుంచి 10 గంటల వరకు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, పసుపు, గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో స్నపనతిరుమంజనం చేపట్టారు.