నాయిక తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ఖరారు చేశారు. ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకొస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తిరుపతి సమీపంలోని ఓ మారుమూల పల్లెటూరి నేపథ్యంగా కథ సాగుతుందని, ఆసక్తికర అంశాలతో సినిమా ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. రవీందర్ విజయ్, హరీష్ పరేది తదితరులు చిత్ర తారాగణం.