హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీయూజీసెట్ ఫలితాలను శుక్రవారం విడుదల కానున్నాయి. ఈ నెల 19 నుంచి 21 వరకు తొలివిడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇంటర్ మార్కుల మెమో, పాస్పోర్ట్ సైజు ఫొటోలతో కౌన్సెలింగ్కు హాజరుకావాల్సి ఉంటుంది.
రాష్ట్రంలోని ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో చేరేందుకు ఈ నెల 25న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు http://telangana emrs.in నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.