హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై సీఐడీ పోలీసులు ఉకుపాదం మోపారు. ‘డఫాబెట్’ పేరుతో దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న భారీ నెట్వర్ను ఛేదించి, 11 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 3 విలాసవంతమైన బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, కియా సెల్టోస్ కార్లు, 8 ల్యాప్టాప్లు, 2 ఐప్యాడ్లు, 26 మొబైల్ ఫోన్లు, 5 పాస్పోర్టులు, రూ.3.21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐడీ డీజీ చారుసిన్హా సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తూ కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిపినట్టు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు.
కరీంనగర్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ 2024-2025 జనవరి మధ్య బెట్టింగ్లలో రూ.9.95 లక్షలు కోల్పోయినట్టు పోలీసులకు చెప్పాడని, అతని ఫిర్యాదు మేరకు ఈ ముఠాపై కేసు నమోదైందని చెప్పారు. నిందితులు 8 స్థాయిల్లో 46 మధ్యవర్తి బ్యాంకు ఖాతాల ద్వారా బెట్టింగ్ డబ్బును సేకరించి, ఇతర ఖాతాలకు మళ్లించినట్టు దర్యాప్తులో తేలిందని వివరించారు. ఆన్లైన్ బెట్టింగ్పై ఇప్పటికే 414 కేసులు నమోదు చేశారని డీజీ చారుసిన్హా తెలిపారు.