రాజౌరీ: ఆపరేషన్ త్రినేత్రలో భారత సైన్యం శనివారం ఒక ఉగ్రవాదిని మట్టు పెట్టింది. కండీ అడవిలో జరిగిన ఈ ఆపరేషన్లో మరో టెర్రరిస్ట్ గాయపడినట్టు ఆర్మీ భావిస్తున్నది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్ము కశ్మీర్లో పర్యటిస్తున్న సమయంలోనే ఈ ఆపరేషన్ జరగడం గమనార్హం. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే-56 రైఫిల్, నాలుగు మేగజైన్లు, 56 తూటాలు, ఒక 9 ఎమ్-ఎమ్ పిస్తోలు, మూడు గ్రెనేడ్లు సీజ్ చేసినట్టు ఆర్మీ పీఆర్వో తెలిపారు. కశ్మీర్లో తాజా పరిస్థితిపై రాజ్నాథ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.