న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఉగ్రదాడులు జరుగువచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికతో జమ్ము కశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆ వర్గాల సమాచారం ప్రకారం… ‘హర్కత్ 313’ అనే కొత్త ఉగ్రవాద సంస్థ యురిలోని జల విద్యుత్తు కేంద్రాలపై దాడికి పన్నాగం పన్నుతున్నది. అనంత్నాగ్లోని ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్’ను లక్ష్యం చేసుకున్నది. దీంతో అధికారులు ఎల్వోసీ దగ్గర్లోని యురి-1, యురి-2 విద్యుత్తు కేంద్రాల వద్ద భద్రతను పటిష్ఠం చేశారు.