శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఇవాళ ఉగ్రదాడి జరిగింది. శ్రీనగర్లో జరిగిన ఈ ఘటనలో ఓ సీఆర్పీఎఫ్ జవాను మృతిచెందాడు. మరో జవాను గాయపడ్డాడు. గాయపడ్డ జవాన్లను సమీపంలోని ఎస్ఎంహెచ్ఎస్ హాస్పిటల్కు తరలించారు. భద్రతా దళాల చెక్ పాయింట్ వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దాడి చేసిన తర్వాత ఉగ్రవాదులు పారిపోయినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రదేశాన్ని సీజ్ చేశారు. సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. పుల్వామాలో ఇద్దరు వలస కూలీలపై కాల్పుల ఘటన జరిగిన రెండు గంటల వ్యవధిలోనే ఉగ్రదాడి జరగడం శోచనీయం. వరుసగా రెండవ రోజు బీహారీ కూలీలపై కాల్పులు జరిగాయి.