హైదరాబాద్, ఆట ప్రతినిధి : రాష్ట్రంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగిసినా ఇంకా అదే హోదాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) చైర్మన్గా శివసేనారెడ్డి రెండేండ్ల పదవీకాలం జూలైలోనే ముగిసినా ఆయన కుర్చీని వదలడం లేదు. ఎల్బీ స్టేడియంలోని తన చాంబర్ను ఖాళీ చేయకుండా ఇంకా చైర్మన్గానే చలామణి కావడంపై విమర్శలు వస్తున్నాయి.
గత నెల 29న జరిగిన నేషనల్ స్పోర్ట్స్ డే అధికారిక వేడుకలకు చైర్మన్ హోదాలో హాజరైన ఆయన మంగళవారం ఎల్బీ స్టేడియంలోని చైర్మన్ చాంబర్లో ఏకంగా అధికారిక సమీక్షలో పాల్గొన్నారు. శాట్ క్రీడా ప్రాంగాణల్లో కోచింగ్ ఫీజుల పెంపు అంశంపై శివసేనారెడ్డి, ఎండీ సోనిబాలా దేవి.. ఉన్నతాధికారులు, స్టేడియాల అడ్మినిస్ట్రేటర్లు, కోచ్లతో సమీక్ష నిర్వహించారు. దీనిపై శివసేనారెడ్డిని వివరణ కోరగా.. తనకు మరో టర్మ్ ఎక్స్టెన్షన్ ఖరారైందని, ఉత్తర్వులు రావడమే ఆలస్యమని చెప్పారు.