ఢిల్లీ చేతిలో ఓటమి
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో విజయం కోసం పరితపిస్తున్న తెలుగు టైటాన్స్కు మరోసారి నిరాశే ఎదురైంది. బుధవారం జరిగిన హోరాహోరీ పోరులో టైటాన్స్ 35-36తో ఢిల్లీ దబాంగ్ చేతిలో ఓటమిపాలైంది. రజనీశ్ 20 పాయింట్లతో విజృంభించినా టైటాన్స్ జట్టు తృటిలో విజయావకాశాన్ని చేజార్చుకుంది. సురీందర్ సింగ్ (4), అంకిత్ (3) రాణించగా.. రోహిత్, సందీప్ ఒక్కో పాయింట్ సాధించారు. ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ 25 పాయింట్లతో అదరగొట్టి ఈ సీజన్లో వంద పాయింట్లు పొందిన రైడర్గా నిలిచాడు. ఆడిన ఆరు మ్యాచ్ల్లో రెండింట ‘డ్రా’ చేసుకున్న టైటాన్స్ నాలుగింట ఓడింది. ఈ విజయంతో ఢిల్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. తెలుగు జట్టు చివరి రెండో స్థానానికి చేరింది. మరో మ్యాచ్లో పుణెరి పల్టాన్ 33-26తో గుజరాత్ జెయింట్స్పై విజయం సాధించింది.