బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ నిరీక్షణ కొనసాగుతున్నది. ఎనిమిదో సీజన్లో ఐదు మ్యాచ్లు ఆడిన టైటాన్స్ ఇప్పటి వరకు గెలుపు రుచి చూడలేకపోయింది. సోమవారం జరిగిన హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్ 30-31తో పట్నా పైరెట్స్ చేతిలో ఓటమి పాలైంది. ఆఖరి క్షణాల్లో ప్రత్యర్థిని ఆలౌట్ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్న టైటాన్స్.. ఒక పాయింట్ తేడాతో పరాజయం వైపు నిలిచింది. టైటాన్స్ తరఫున అంకిత్ (10) సూపర్-10 సాధించగా.. రాకేశ్ (7) ఫర్వాలేదనిపించాడు. ప్రత్యర్థి జట్టులో మోనూ గోయత్ (7), సచిన్ (6), ప్రశాంత్ (5) రాణించారు. ఆడిన ఐదు మ్యాచ్ల్లో మూడింట ఓడి.. రెండింటిని ‘డ్రా’ చేసుకున్న టైటాన్స్ 9 పాయింట్లతో పట్టికలో 11 స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్లో బెంగల్ వారియర్స్ 31-28తో జైపూర్ పింక్ పాంథర్స్పై విజయం సాధించింది. బెంగాల్ తరఫున మణిందర్ సింగ్ (13) సత్తాచాటగా.. జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ (16) విశ్వరూపం కనబర్చాడు.