హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ సాయి కార్తీక్ రెడ్డి.. ఐటీఎఫ్ టోర్నీలో రన్నరప్గా నిలిచాడు.
ట్యూనిషియా వేదికగా జరిగిన టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో సాయికార్తీక్-మహమ్మద్ అలీ (అల్జేరియా) జోడీ 3-6, 1-6తో లీ మిన్-సున్ క్యూయి (చైనా) జంట చేతిలో ఓటమి పాలైంది. వరుస విజయాలతో తుదిపోరుకు అర్హత సాధించిన సాయికార్తీక్ ద్వయం.. ఫైనల్లో వరుస సెట్లలో ఓటమి పాలైంది.