హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మం డలి (ఎన్సీఈఆర్టీ) ఆన్లైన్ వేదికగా భౌతికశాస్త్రం- విద్యలో ఉద్భవిస్తున్న పోకడలు అనే అంశంపై నిర్వహించే జాతీయ సదస్సుకు తెలంగాణ ఉపాధ్యాయుడు ఎంపికయ్యారు. ఈ నెల 27, 28 తేదీల్లో అజ్మీర్ నుంచి ఆన్లైన్ వేదికగా జరిగే సదస్సుకు ఉపాధ్యాయు డు, సైన్స్ కమ్యూనికేటర్ డాక్టర్ వీ గురునాథరావుకు ఆహ్వానం అందింది. భౌతికశాస్త్ర విద్యలో కంప్యూటర్ ఆధారిత సాంకేతికత మద్దతు అనే అంశంపై ఆయన పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. గురునాథరావు మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.