హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 12(నమస్తే తెలంగాణ): పనులకు సం బంధించిన ఫైల్ను ఆమోదించేందుకు ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఇబ్రహీంబాగ్ విద్యుత్తు ఏడీఈ చరణ్సింగ్ శుక్రవారం ఏసీబీకి చిక్కాడు. ప్రైవేటు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ రవికుమార్ ఇబ్రహీంనగర్లోని సెక్రెటరియల్ కాలనీ, మణికొండ ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు, మీటర్లు ఏర్పాటు చేసేందు కు, హనుమాన్ నగర్, మణికొండ ప్రాంతాల్లో హెచ్టీ లైన్ను మార్చేందుకు కాంట్రాక్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఫైల్ను ఆమోదించేందుకు ఏడీఈ చరణ్సింగ్ రవికుమార్ నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు