వరంగల్ అర్బన్ :
తెలంగాణ వస్తే అప్పుల పాలు అయితది అన్న తెలంగాణ నేడు అబివృద్ధి దిశగా దూసుకుపోతుదంని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హన్మకొండలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బంగారు తెలంగాణ చేస్తున్న సీఎం కేసీఆర్పై ప్రతిపక్షాలు చేస్తున్న చిల్లర రాజకీయాలను మీరంతా గమనించాలన్నారు.
విభజన చట్టంలో ఉన్న కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం, విషయం లో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది.
బంగారు తెలంగాణ నిర్మాణంలో ఉద్యోగులందరి కృషి మరువలేనిదన్నారు.
ఉద్యోగుల సమస్యలు సీఎం కేసీఆర్ దగ్గరకు తీసుకుపోయి త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి ఉద్యోగులు అండగా నిలవాలి. ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఈ సమ్మేళనానికి రాష్ట్ర, జిల్లా గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం నేతలు పరిటా సుబ్బారావు, కారం రవిందర్ రెడ్డి, జగన్ మోహన్ రావు, ఫణి కుమార్, రాజేశ్ తదితరులతోపాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.