హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): అనుమతుల్లేకుండా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న హంద్రీనీవా సుజల స్రవంతి లిఫ్ట్ స్కీం విస్తరణ పనులను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు రాష్ట్ర నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధిశాఖల ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ సోమవారం లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఇరు తెలుగు రాష్ర్టాలు ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టినా, వినియోగంలో ఉన్న ప్రాజెక్టు ల సామర్థ్యాన్ని విస్తరించినా ముందుగా కేఆర్ఎంబీ లేదా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆ యన పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తూ హెచ్ఎన్ఎస్ఎస్ విస్తరణ పనులు చేపట్టిందని ఆ రోపించారు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ పత్రాలను లేఖతో పాటు జతచేశారు.
మెండోరా, నవంబర్ 15: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మ న్ చంద్రశేఖర్ అయ్యర్ సోమవారం సం దర్శించారు. నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రాజెక్టు నిర్మాణ క్రమం, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలు తె లుసుకున్నారు. ప్రాజెక్ట్ నీటి వినియోగం లో సమస్యలను అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన సింగూరు, నిజా ంసాగర్, అలీసాగర్, ఎస్సారెస్పీ, చౌట్పల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు.