గూడు లేని నిరుపేద కుటుంబాలకు చక్కటి సౌలత్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం గ్రేటర్లో చురుగ్గా పూర్తవుతోంది. నగరంలో ఇప్పటికే వేలాది ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించారు. ఇండ్ల నిర్మాణంలో మెగా ప్రాజెక్టుగా పేరొందిన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో నిర్మించిన అతిపెద్ద గృహ సముదాయం వచ్చేనెలలో అందుబాటులోకి రానుంది. సీఎం కేసీఆర్ లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందజేసి గృహ ప్రవేశాలు చేయించనున్నారు. ఔటర్ రింగ్రోడ్డును ఆనుకొని సుమారు 145 ఎకరాల విస్తీర్ణంలో చూడచక్కగా నిర్మించిన ఈ భారీ గృహ సముదాయం కార్పొరేట్ అపార్ట్మెంట్లను తలదన్నేలా ఆకట్టుకుంటోంది.
సిటీబ్యూరో, జనవరి 27(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీన, పేద వర్గాల అభ్యున్నతి కోసం, వారు ఆత్మ గౌరవంగా బతికేలా వారికో గూడును కల్పిస్తూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ మహా నగరంలో ఎప్పటికీ నెరవేరని సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేస్తున్నది. అందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తున్నది. ఇప్పటికే నగరంలో పలు చోట్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నారు.
ఇందులో భాగంగానే తాజాగా సంగారెడ్డి జిల్లా కొల్లూరులో అతి పెద్ద అత్మగౌరవ వేదికగా నిలిచే డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కొల్లూరులో రూ.1,422.15 కోట్లతో సర్కారు ఎస్+9, ఎస్+10, ఎస్+11 అంతస్తుల్లో 15,600 ఇండ్లను అత్యున్నత ప్రమాణాలతో ఆదర్శ టౌన్షిప్గా నిర్మించింది. ఔటర్ను ఆనుకుని అబ్బురపరిచేలా నిర్మాణం పూర్తి చేసుకున్న గృహ సముదాయాన్ని వచ్చే నెల మొదటి వారంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. కాగా, ఒకే చోట 15,600 రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం పూర్తికావడం, ప్రభుత్వ పరంగా లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేసే అతి పెద్ద హౌసింగ్ ప్రాజెక్టు ఇదే మొదటి కావడం గమనార్హం.
సామాజిక వసతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
కాలనీ వాసులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు పారు, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్, ఓపెన్ జిమ్, ఇండోర్ స్పోర్ట్ కాంప్లెక్స్, ఓపెన్ స్పోర్ట్స్ ఏరియా, కిడ్స్ ల్లాట్ టట్స్, మల్టీ పర్పస్ గ్రౌండ్, ఆంఫీ థియేటర్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, బతుకమ్మ ఘాట్ ఏర్పాటు చేశారు. స్థానికంగా నివసించే ప్రజల కోసం ఆధునిక కూరగాయల, మాంసాహార మారెట్ ఏర్పాటు, ప్లే సూల్, అంగన్ వాడి సెంటర్, బస్తీ దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు, ప్రాథమిక, ఉన్నత పాఠశాల, బస్ టెర్మినల్, బస్ స్టాప్, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, మిల్ బూత్లు, పెట్రోల్ బంకులు, పోస్టాఫీసు, ఏటీఎం బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు, సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యార్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.
సకల హంగులతో..
సకల హంగులతో పేదలకు మౌలిక సదుపాయం కల్పనలో చిన్న సమస్య ఉత్పన్నం కాకుండా పటిష్టమైన, మెరుగైన సౌకర్యాలు ఇక్కడ కల్పించారు. రూ.1,422.15 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్లకు తీసి పోకుండా ఈ డబుల్ ఇండ్లను నిర్మించారు. 115 బ్లాక్లలో ఈ గృహాల నిర్మాణాలు చేపట్టారు. స్టిల్ట్ పారింగ్తో పాటు పెవ్ బ్లాక్స్, వాచ్మెన్ గది ఏర్పాటు చేశారు. ప్రమాదాల నియంత్రణకు ఫైర్ ఫిట్టింగ్, 8 మంది కెపాసిటీ గల ప్రతి బ్లాక్కు రెండు చొప్పున 234 లిఫ్ట్లను ఏర్పాటు చేశారు. లిఫ్ట్, గృహాలకు నిరంతర విద్యుత్ నిమిత్తం పవర్ బ్యాక్ అప్ కోసం ప్రత్యేక జనరేటర్ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రోద్బలంతో హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు అహర్నిశలు శ్రమించి ముఖ్యమంత్రి సంకల్పించిన లక్ష్యాన్ని నెరవేర్చారు.
వచ్చేనెల మొదటి వారంలో అందుబాటులోకి.. మౌలిక వసతులు, సదుపాయాల వివరాలు..