హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగనుంది. ప్రగతిభవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయి. భారత్లో తెలంగాణ విలీనమై 74 ఏండ్లు పూర్తయ్యి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో తెలంగాణ వజ్రోత్సవాల నిర్వహణ, పోడుభూముల సమస్య పరిష్కారం తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశమున్నట్టు తెలిసింది.
కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా తెలంగాణపై ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో అదనపు వనరుల సమీకరణపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. మహిళా యూనివర్సిటీ, సాగునీటి పారుదల రంగానికి చెందిన అంశాలు, ఉద్యోగులకు డీఏ పెంపు తదితర అంశాలపై క్యాబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.