మంజుల కండక్టర్ డ్యూటీలో ఉందంటే.. డ్రైవర్కు ఇబ్బందే లేదు. చకచకా టికెట్లు కొట్టేస్తుంది. రాబోయే స్టేజీ గురించి ప్యాసింజర్లను హెచ్చరిస్తుంది. ఎంత రద్దీ ఉన్నా.. జనంలోకి దూసుకు వెళ్తుంది. ఆ క్రమశిక్షణకు, ఫిట్నెస్కు కారణం.. ఆమె క్రీడా నేపథ్యం. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దొంగ ఎన్కెపల్లి మంజుల సొంతూరు. బాల్యం నుంచీ గేమ్స్, స్పోర్ట్స్ అంటే ఇష్టం. మంజుల పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. చదువుకునే రోజుల్లో ఆటల పోటీల్లో చురుగ్గా పాల్గొనేది.
ప్రస్తుతం కూకట్పల్లి ఆర్టీసీ డిపో పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నది. స్కూల్ గేమ్స్ మొదలు నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో.. లాంగ్ జంప్, హై జంప్, ట్రిపుల్ జంప్లలో 47 బంగారు,15 వెండి, 10 కాంస్య పతకాలు సాధించింది. ఇటీవల కౌలాలంపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్షిప్లో రన్నింగ్లో బంగారు పతకం, హైజంప్లో వెండి పతకం గెలుచుకుంది. తనకు పెండ్లయింది. ఇద్దరు పిల్లలు. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ను కలవాలన్నదే తన ఆకాంక్ష అని చెబుతున్నది మంజుల.