హిసార్: జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ శుభారంభం చేశాడు. హర్యానా వేదికగా జరుగుతున్న టోర్నీ పురుషుల 57 కేజీల విభాగంలో హసుముద్దీన్ అస్సాం బాక్సర్ బులెన్ బోర్గొహైపై ఘన విజయం సాధించాడు. నిరుడు కామన్వెల్త్ గేమ్స్లో కాంస్యం నెగ్గిన హుసాముద్దీన్.. జాతీయ టోర్నీలోనూ అదే జోరు కొనసాగించాడు. ఇతర బౌట్లలో గౌరవ్ సొలాంకి (60 కేజీలు), విశ్వామిత్ర చొంగ్తమ్ (51 కేజీలు) విజయాలు సాధించారు.