న్యూఢిల్లీ : భారత్లో గూగుల్ తన ఫ్లాగ్షిప్ ఫోన్ను లాంఛ్ చేస్తోంంది. భారత్లో పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రొను ప్రవేశపెడుతున్నట్టు టెక్ దిగ్గజం గూగుల్ గత వారం ధ్రువీకరించింది. నెక్స్ట్ పిక్సెల్ వాచ్ సహా ఇతర గూగుల్ ఉత్పత్తులతో పాటు అక్టోబర్ 6న పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రొ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. 2018 తర్వాత భారత్లోకి రానున్న గూగుల్ తొలి ప్రీమియం ఫోన్లు ఇవే కావడం గమనార్హం.
మెరుగైన సాఫ్ట్వేర్ సపోర్ట్, నాణ్యమైన కెమెరాలతో కూడిన ప్రీమియం స్మార్ట్ఫోన్లకు భారత్లో డిమాండ్ పెరుగుతున్న క్రమంలో పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రొ వంటి ఫ్లాగ్షిప్ ఫోన్లను భారత్లో లాంఛ్ చేసేందుకు గూగుల్ మొగ్గుచూపింది.
భారత్లో గత నాలుగేండ్లుగా ప్రీమియం ఫోన్ల లాంఛింగ్కు గూగుల్ ఆసక్తి కనబరచకపోవడంతో ఈ వ్యవధిలో షియామి, వన్ప్లస్, వివో వంటి ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు భారత్ ప్రీమియం స్మార్ట్ఫోన్ మార్కెట్లో మెరుగైన వాటా దక్కించుకున్నాయి. ఇక పిక్సెల్ 7 రూ 48,580 ప్రారంభ ధరకు అందుబాటులో ఉండనుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పిక్సెల్ 7 ప్రొ ధర దాదాపు రూ 72,910 ఉంటుందని చెబుతున్నారు.