Godavari – Kaveri | నదుల అనుసంధానంపై హైదరాబాద్లో టాస్క్ఫోర్స్ సమావేశమైంది. ఈ భేటీలో తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. భేటీలో కెన్-బెత్వా ప్రాజెక్టు, పర్బతి -కలిసింద్-చంబల్ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ఈ సందర్భం తెలంగాణ ట్రైబ్యునల్ కేటాయింపులపై అభిప్రాయాలను తన అభిప్రాయాలను వెలడించింది. కేటాయింపులకు ఇబ్బంది లేనంత వరకు గోదావరి జలాల తరలింపునకు ఇబ్బంది లేదని, గోదావరి-కావేరి అనుసంధానంలో ప్రతిపాదిత వాటా కంటే ఎక్కువ కావాలని స్పష్టం చేసింది. అదే సమయంలో వీలైనంత తక్కువ భూసేకరణ ఉండాలని.. ప్రతిపాదిత ఆనకట్ట ఇచ్చంపల్లికి ఎగువన ఉంటే ఇబ్బంది ఉండదని చెప్పింది. ఇచ్చంపల్లికి ఎగువన సమ్మక్క ఆనకట్ట బ్యాక్వాటర్తో ఇబ్బంది ఉండదన్నారు.
ఈ సందర్భంగా నదుల అనుసంధాన పథకంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరామ్ మాట్లాడుతూ ఎక్కువ వాటా కావాలన్న తెలంగాణ విజ్ఞప్తిని ఎన్డబ్ల్యూడీఏ పరిశీలిస్తుందన్నారు. తొలి దశలో 400 హెక్టార్ల భూమి మాత్రమే అవసరమన్నారు. భూ నిర్వాసితులకు ఉత్తమ ప్యాకేజీ ఉంటుందని, ఎన్డబ్ల్యూడీఏ బృందం ఇచ్చంపల్లి ప్రాంతాన్ని పరిశీలిస్తుందన్నారు. సమ్మక్క ఆనకట్ట బ్యాక్వాటర్ ప్రభావం లేకుండా చూస్తారన్నారు. ఈ సందర్భంగా ఏపీ స్పందిస్తూ.. గోదావరి మిగులు జలాలు ఛత్తీస్గఢ్ వాడని జలాలనే తరలించాలని కోరింది.
సీడబ్ల్యూసీ తాజా అధ్యయనాలు ఎన్డబ్ల్యూడీఏ లెక్కలోకి తీసుకోవాలని.. సాగర్, సోమశిల, ప్రస్తుత ఆయకట్టు కొత్త అవసరాలు తీర్చడంపై స్టడీ చేయాలని చెప్పింది. ప్రాజెక్టు సాంకేతిక అంశాలపై చర్చకు మాతో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేయాలని.. దిగువ రాష్ట్రంలో తమ ప్రయోజనాలను పరిరక్షిస్తామన్న హామీ కావాలని కోరింది. గోదావరి మళ్లింపునకు ఇచ్చంపల్లికి బదులుగా పోలవరాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. దీనికి టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ శ్రీరాం స్పందిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ మిగులు జలాలను వినియోగించుకునేది లేదన్నారు. సాంకేతిక అంశాలపై ఏపీతో ఎన్డబ్ల్యూడీఏ విడిగా భేటీ నిర్వహిస్తుందని తెలిపారు. సాగర్, సోమశిల సామర్థ్యంపై ఎన్డబ్ల్యూడీఏ అధ్యయనం చేయాలన్నారు.
దిగువ రాష్ట్రం హక్కులకు భంగం వాటిల్లబోదని, ఇచ్చంపల్లి నుంచి సాగర్ కాల్వ తెలంగాణ అవసరాలకు లోబడి ఉంటుందన్నారు. ఇచ్చంపల్లి ప్రతిపాదన మొదటి దశ మాత్రమేనని.. తదుపరి దశలో పోలవరం ప్రతిపాదన పరిశీలిస్తామన్నారు. సందర్భంగా ఒప్పందంపై సంతకాలకు తెలంగాణ, ఏపీ సంసిద్ధత తెలిపాయన్నారు. ప్రాజెక్టుకు పూర్తి మద్దతు తెలిపిన కర్నాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మద్దతు తెలిపినట్లు వివరించారు. సమావేశంలో నేషనల్ వాటార్ డెవలప్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్, తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే హారయ్యారు. ఇతర భాగస్వామ్యరాష్ట్రాల అధికారులు వర్చువల్ విధానంలో భేటీలో పాల్గొన్నారు.