హైదరాబసిటీబ్యూరో, జనవరి 21 : హైదరాబాద్ కేంద్రస్థానంగా ఐటీ సేవలు అందిస్తున్న తాన్లా ప్లాట్ఫామ్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను సంస్థ రూ.158 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన దాంతో పోలిస్తే ఇది 69 శాతం అధికమని పేర్కొంది. గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 35 శాతం ఎగబాకి రూ.884 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. ప్రస్తుతం సంస్థ వద్ద రూ.30 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. అలాగే ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలానికిగాను రూ.2,352 కోట్ల ఆదాయంపై రూ.398.70 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, సీఎండీ ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ..గత త్రైమాసికంలో అన్ని విభాగాలు ఆశాజనక పనితీరు కనబరిచినట్లు, భవిష్యత్తులో మరింత మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉన్నదన్నారు.