బెంగళూరు, ఫిబ్రవరి 22: ఆన్లైన్ బుకింగ్లపై ఆహార పదార్థాలు అందించే స్విగ్గీ..స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. సాఫ్ట్బ్యాంక్ మెజార్టీ వాటా కలిగిన ఈ సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపీవోకి రాబోతున్నది. ఈ వాటాల విక్రయం ద్వారా గరిష్ఠంగా రూ.6 వేల కోట్ల వరకు నిధులను సమీకరించాలని యోచిస్తున్నది. దీనిపై కంపెనీ వర్గాలు స్పందించడానికి నిరాకరించాయి. ఇటీవలకాలంలో ఇండిపెండెంట్ డైరెక్టర్లను నియమించుకున్న సంస్థ..లాజిస్టిక్ సేవలపై కూడా దృష్టి సారించింది కూడా.