మానవాళికి పచ్చని ప్రకృతిని ప్రసాదించేందుకు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ’గ్రీన్ ఇండియా చాలెంజ్’. అప్రతిహతంగా ప్రజల్లోకి వెళ్తున్న ఈ కార్యక్రమంలో సినీ తారలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆదివారం బిగ్ బాస్ పోటీదారు శ్వేతవర్మ, సినీ నటి సాత్విక జై ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో పాల్గొని ప్రశాసన్ నగర్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ..‘పచ్చదనం, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉందని గుర్తు చేస్తున్న గొప్ప కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ గారికి కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొనాలి’అని అన్నారు.