స్టాక్హోం: తమ దేశ అత్యున్నత పురస్కారం ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, కమాండర్ గ్రాండ్ క్రాస్’తో ప్రధాని మోదీని స్వీడన్ సత్కరించింది. ప్రధాని మోదీ అందుకున్న 31వ అంతర్జాతీయ పురస్కారం ఇది. రెండు రోజుల స్వీడన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం ఇక్కడి గోథెన్బర్గ్కు చేరుకున్నారు.
ఈ పర్యటనలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, సహకారంపై ప్రధాని మోదీ, ఉల్ఫ్ క్రిస్టర్సన్తో చర్చలు జరపనున్నారు. క్రిస్టర్సన్ వ్యక్తిగత ఆహ్వానం మేరకు ప్రధాని ఈ పర్యటన చేపట్టారు.