మాస్కో, మే 17 : రష్యా రాజధాని మాస్కో దాని చుట్టుపక్కల ప్రాంతాలపై ఉక్రెయిన్ వందలాది డ్రోన్లతో విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున మాస్కోపై డ్రోన్ దాడిలో ఒక భారతీయ కార్మికుడు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనను మాస్కోలోని భారత రాయబార కార్యాలయం అధికారులు ధృవీకరించారు. గాయపడ్డవారికి వైద్య సాయం అందిస్తున్నామని చెప్పారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు రష్యాపై ఉక్రెయిన్ 600 వరకు డ్రోన్ దాడులు నిర్వహించగా, నలుగురు మృతి చెందారని క్రెమ్లిన్ అధికార వర్గాలు తెలిపాయి.