వివాహాలు, పండుగలను దృష్టిలో పెట్టుకుని దేశంలోనే ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్ర్తాలు, ఆభరణాలు, లైఫ్స్టైల్ ఉత్పత్తులతో సూత్ర ఫ్యాషన్ ప్రదర్శన నగరానికి వచ్చింది. బంజారాహిల్స్లోని తాజ్కృష్ణా హోటల్లో ఈ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ శుక్రవారం ప్రారంభమైంది. టాలీవుడ్ హీరోయిన్లు లావణ్య శర్మ, రితికా చక్రవర్తితో పాటు మోడల్స్ పలు డిజైన్ల ఆభరణాలు, వస్ర్తాలను ధరించి సందడి చేశారు. ఆదివారం దాకా ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.