ముంబై: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి లెఫ్టార్మ్ మీడియం పేసర్ సుశాంత్ మిశ్రా చేరాడు. గాయం కారణంగా యూపీ పేసర్ సౌరభ్ దూబే ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే నిష్క్రమించాడు. అతడి స్థానంలో రాంచీకి చెందిన సుశాంత్ను హైదరాబాద్ తీసుకుంది. నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లాడిన 21 ఏండ్ల సుశాంత్ 13 వికెట్లు పడగొట్టాడు. దూబే ధర రూ.20 లక్షలకే సుశాంత్ను జట్టులోకి తీసుకున్నట్లు సన్రైజర్స్ బుధవారం తెలిపింది. వరుస విజయాలతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.