సూర్యాపేట జిల్లా: అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సూర్యాపేట వాసి నరేంద్రుని చిరు సాయి మృతి చెందాడు. జాబ్ ముగించుకొని రూమ్ కి వెళ్తున్న సమయంలో కార్ ను టిప్పర్ ఢీకొట్టింది. తీవ్రంగా మంచు కురుస్తుండడంతో వేగంగా వచ్చిన టిప్పర్ కార్ ని ఢీకొట్టడంతో చిరు సాయి స్పాట్ లో మృతి చెందినట్లు సమాచారం. అమెరికాలోని ఒహయో స్టేట్ లో ఘటన చోటు చేసుకుంది. డిసెంబర్ మధ్యలో ఇండియాకు తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో చిరు సాయి తో ప్రయాణిస్తున్న నల్గొండకు చెందిన మరొకరు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లినట్లు తెలిసింది. మరణించిన చిరు సాయి డెడ్ బాడీ ని ఇండియా కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులను టీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. పార్థీవదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తరపున ప్రయత్నాలు చేస్తామని వారు హామీ ఇచ్చారు.