మేళ్లచెర్వు, మార్చి 10 : భద్రతా చర్యలు పాటించేలా యువతకు శిక్షణ ఇవ్వాలని ఉమ్మడి నల్లగొండ పరిశ్రమల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శశికుమార్ సూచించారు. స్థానిక మైహోం ఇండస్ట్రీస్లో గురువారం 51వ జాతీయ భద్రతా ముగింపు వేడుకలు నిర్వహించారు. కార్మికులతో భద్రతా శపథం చేయించారు. ఈ సందర్భంగా ప్లాంట్ హెడ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిశ్రమలో భద్రతకు సంబంధించి పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ హెడ్ అగర్వాల్, ఏవీపీ పంకజ్, భద్రతా విభాగ అధిపతి మహేశ్వర్రావు, రాజబాబు, షాహిద్, హెచ్ఆర్ హెడ్ నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
చింతలపాలెం : ఉద్యోగులు భద్రతా విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని భద్రతా డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శశికుమార్ అన్నారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద డీఎస్ జెన్కోలో గురువారం నిర్వహించిన 51వ భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారోత్సవాల్లో నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. అంతకుముందు ఉద్యోగుల భద్రతాలో భాగంగా వారితో ప్రతిజ్ఞ చేసి మాట్లాడారు. ప్రతిఒక్కరూ భద్రతలు పాటిస్తూ విధులు నిర్వహించి రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జెన్కో ఎస్సీ దేశ్యా, డీఈలు రవి, నర్సింహారావు, సీఈ సురేశ్, ఏడీ సునిల్కుమార్, ఏడీఈలు సంతోష్కుమార్, సాత్విక్, పిచ్చిరెడ్డి, శీనయ్య, శ్రీకాంత్, రాజశేఖర్, మాధవి, కృష్ణకుమారి, దుర్గా భవాని, ఏఈలు, ఉద్యోగులు పాల్గొన్నారు.