న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ నేత మొహమ్మద్ ఆజం ఖాన్కు తాత్కాలిక బెయిల్ను సుప్రీంకోర్టు నిరాకరించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గోవాలనుకున్న ఆజం ఖాన్కు నిరాశే మిగిలింది. 2020 ఫిబ్రవరి నుంచి ఆయన సీతాపూర్ జైలులో ఉన్నారు. ఆజం ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్ .. సమాజ్వాదీ అభ్యర్థిగా సువార్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. జస్టిస్ ఎల్ ఎన్ రావు నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును విచారిస్తూ.. బెయిల్ పెండింగ్లో ఉన్న అలహాబాద్ హైకోర్టుకు ఆజం వెళ్లాలంటూ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ను కోర్టు కోరింది.