న్యూఢిల్లీ: క్రూరమైన క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన చట్టసభ సభ్యులపై జీవితకాల నిషేధం విధించాలని, అదేవిధంగా వారిపై కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కోరు తూ దాఖలైన పిల్పై వచ్చే వారం విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తరహా కేసుల విచారణకు హైకోర్టులు అదనపు ప్రత్యేకకోర్టులను ఏర్పాటు చేయడంతో పాటు సీబీఐ, ఇతర సంస్థల ద్వారా త్వరితగతిన విచారణ జరిపి ముగించాలని ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రమణ నేతృత్వం లో ధర్మాసనం ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీచేస్తూ వచ్చి ంది. సిట్టింగ్ లేదా మాజీ ఎంపీలపై 121 కేసులు.. సిట్టింగ్ లేదా మాజీఎమ్మెల్యేలపై 112కేసులు పెండింగ్లో ఉన్నాయి.