న్యూఢిల్లీ: ఉదయ్పూర్ ఫైల్స్-కన్హయ్య లాల్ టైలర్ మర్డర్(Udaipur Files) ఫిల్మ్ రిలీజ్కు సంబంధించిన కేసులో ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసును మళ్లీ జూలై 21వ తేదీన విచారించనున్నట్లు కోర్టు పేర్కొన్నది. జస్టిస్ సూర్యకాంత్, జోయ్మాలా బగ్చీతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. చిత్ర రిలీజ్ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్పై స్పందిస్తూ.. ఈ ఫిల్మ్ అంశంలో కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు ధర్మాసనం చెప్పింది. కేంద్రం ఏర్పాటు చేసిన ప్యానెల్ దీనిపై త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తుందని, అప్పటి వరకు వేచి ఉండాలని కోర్టు నిర్మాతలను కోరింది. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ప్యానెల్ సమావేశం కానున్నది. ఉదయ్పూర్ ఫైల్స్ ఫిల్మ్ రిలీజ్పై స్టే ఇస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిర్మాతలు సవాల్ చేశారు.
ఉదయ్పూర్ ఫైల్స్:కన్నయ్య లాల్ టేలర్ మర్డర్ టైటిల్తో ఈనెల 11వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని భావించారు. వాస్తవానికి ఆ సినిమాకు సీబీఎఫ్సీ సర్టిఫికేట్ వచ్చింది. కానీ ఆ ఫిల్మ్ను ప్రదర్శించరాదు అని ఢిల్లీ హైకోర్టు రిలీజ్పై స్టే ఇచ్చింది. సినిమాను పర్మనెంట్గా బ్యాన్ చేయాలని కోరుతూ కొందరు అభ్యరిస్తున్నారని, దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ఉదయ్పూర్ ఫైల్స్ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా స్టే ఇస్తున్నామని ఢిల్లీ హైకోర్టు జూలై 10వ తేదీన కోర్టులో పేర్కొన్నది. సమాజంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ఫిల్మ్ను బ్యాన్ చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది.
జామియత్ ఉలామా ఇ హింద్ అద్యక్షుడు, దారుల్ ఉలూమ్ దియోబాండ్ ప్రిన్సిపాల్ మౌలానా అర్షద్ మదాని ఫిల్మ్పై బ్యాన్ విధించాలని తన పిటీషన్లో కోరాడు. జూన్ 26వ తేదీన రిలీజైన ట్రైలర్లో అభ్యంతరకరమైన డైలాగ్లు ఉన్నాయని పిటీషన్లో పేర్కొన్నాడు.
ఉదయ్పూర్కు చెందిన టేలర్ కన్నయ్య లాల్ను 2022 జూన్లో మర్డర్ చేశారు. మొహమ్మద్ రియాజ్, మొహమ్మద్ గౌస్ ఆ హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు చెందిన అంశాన్ని కన్నయ్య లాల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో అతన్ని హతమార్చారు. ఎన్ఐఏ పోలీసులు ఈ కేను విచారిస్తున్నారు. యూఏపీఏ కింద నిందితులపై కేసు పెట్టారు. జైపూర్లోని ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉన్నది.