న్యూఢిల్లీ: భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ గాయం కారణంగా బెలారస్ టూర్కు దూరం కానున్నాడు. బహ్రెయిన్, బెలారస్తో ఈనెల 23 నుంచి 26 వరకు జరిగే మ్యాచ్ల నుంచి సునీల్ వైదొలిగాడు. ఈ టూర్కు అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ప్రకటించిన 38 మంది సభ్యుల బృందంలో సునీల్ పేరు లేదు. కోచ్ ఇగోర్ స్టిమాక్ నేతృత్వంలో భారత్ బహ్రెయిన్ పర్యటనకు సిద్ధమవుతున్నది. 10 నుంచి పుణెలో ప్రాక్టీస్ మొదలుపెట్టనున్న భారత ఫుట్బాల్ బృందం ఈనెల 21న బహ్రెయిన్కు పయనం కానుంది. ‘స్నేహాపూర్వక మ్యాచ్లకు వెళ్లాలనే ఎంతో ఆశించా. కానీ దురదృష్టవశాత్తు దూరమవుతున్నా. గాయాలతో కొన్నాళ్లుగా గడ్డు రోజులు ఎదుర్కొంటున్నా. కోలుకోవడానికి నేను తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా’ అని సునీల్ తెలిపాడు.