నారాయణపేట జిల్లా మక్తల్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి పాదాలను బుధవారం సూర్యకిరణాలు తాకాయి. ఉదయం 6:45 గంటల ప్రాంతంలో గర్భగుడిలోని స్వామివారి పాదాలపై కిరణాలు పడ్డాయి. ఈ కిరణాలు కార్తీక మాసానికి ముందు వస్తాయని అర్చకులు తెలిపారు. క్రితం సారి ఇదే సమయంలో స్వామివారి శిరస్సుపై పడితే, ఈసారి పాదాలపై పడ్డాయని ఆయన పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. – మక్తల్ రూరల్