వనస్థలిపురం, జనవరి 23 : సాగర్ రహదారి బీఎన్రెడ్డినగర్ సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు బీభత్సం సృష్టించాయి. శ్రీపురంకాలనీ సమీపంలో ఇటీవల ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. అది గమనించని ఓ కారు డ్రైవర్ వేగంగా వెళ్లాడు. సడెన్గా సిగ్నల్ కనిపించడంతో హఠాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక ఉన్న మిథాని డిపోకు చెందిన బస్సు డ్రైవర్ కూడా సడెన్ బ్రేక్ వేశాడు. ఆ బస్సు వెనకాల ఉన్న ఇబ్రహీంపట్నంకు చెందిన బస్సు వేగం అదుపు తప్పి ముందు ఉన్న బస్సును ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక ఉన్న మరో కారు బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో జరిగిపోయిన ఈ ప్రమాదంలో 4కార్లు, రెండు బస్సులు దెబ్బతిన్నాయి. రెండు బస్సుల్లో మొత్తం 62మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనలో ఓ కండక్టర్, నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. చాలా సేపు ట్రాఫిక్ స్తంభించి పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. గాయాలైన వారిని దవాఖానకు తరలించారు.