కాసిపేట : ఆత్మ విశ్వాసంతో విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవాలని మంచిర్యాల డీఈవో ఎస్. యాదయ్య ( DEO Yadaiah ) సూచించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో కాసిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండలంలోని పదో తరగతి విద్యార్థులకు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, మోటివేషనల్ స్పీకర్ ప్రకాష్ బనావత్ ద్వారా అవగాహన సదస్సును నిర్వహించారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంటం తిరుపతి ఆధ్వర్యంలో గౌరవాధ్యక్షులు చెట్టి శ్రీధర్ సభా అధ్యక్షతన నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి డీఈవో ఎస్.యాదయ్య ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సమయపాలన పాటించాలని, కాలం విలువైనదిగా గుర్తించి నేటి పని రేపటికి వాయిదా వేయకుండా క్రమ శిక్షణతో వ్యవహరించాలన్నారు. లక్ష్యమే గమ్యంగా ముందుకు వెళ్లి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని సూచించారు. విద్యార్థులు పది పరీక్షల్లో తీసుకోవాల్సిన అంశాలపై క్షుణ్ణంగా వివరించారు
అనంతరం విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ముక్తవరం వెంకటేశ్వర స్వామి, జిల్లా కోఆర్డినేటర్ మూర్తి, ఓరియంట్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ అట్టెపల్లి శ్రీనివాస్, డిప్యూటీ రేంజర్ ప్రవీణ్ నాయక్, జిల్లా గర్ల్ చైల్డ్ స్పెషల్ ఆఫీసర్ విజయ లక్ష్మీ, ప్రిన్సిపాల్ ఖలీల్, హెచ్ఎం సాంబమూర్తి, బండ శాంకరి, నాగమల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.