ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 30: విద్యార్థులు ఆంత్రప్రెన్యూర్లుగా మారాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వీ ప్రవీణ్రావు పిలుపునిచ్చారు. ఆ దిశగా అధ్యాపకులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (టీఏఎస్) ఏటా అందించే యంగ్ సైంటిస్ట్ అవార్డుల ప్రదానోత్సవాన్ని శనివారం నిర్వహించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆరుగురికి 2020 యంగ్ సైంటిస్ట్ అవార్డులను అందజేశారు. టీఏఎస్ ఫెలోలుగా, అసోసియేట్ ఫెలోలుగా ఎంపికైనవారికి సంబంధిత ధ్రుపపత్రాలను సైతం అందజేశారు.