ఇందూరు, నవంబర్ 15: ప్రమాదానికి కారణ మయ్యాడని డబ్బుల కోసం వేధించడంతో భ యాందోళనకు గురైన ఓ ఇంటర్ విద్యార్థి.. కాలేజీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్లో చోటుచేసుకున్నది. వేల్పూర్ మండలం పడిగెలకు చెందిన సాయికుమార్ నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సాయికుమార్ కాలికి గాయం కావడంతో 5 రోజులు సెల వు కావాలని సోమవారం ప్రిన్సిపాల్కు లేఖ రాశా డు. సెలవు మంజూరు కావడంతో బైక్పై గ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో సాయికుమార్ బైక్ను వేరే బైక్ ఢీకొట్టింది.
అదుపుతప్పిన సాయికుమార్ ముందువెళ్తున్న మరో బైకును ఢీకొట్టగా ఆ బైక్పై ఉన్నవారికి గాయాలయ్యాయి. వారు సా యికుమార్పై దాడికి దిగారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివరాలు తెలుసుకుని కాలేజీ వరకు తీసుకొచ్చారు. కళాశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇస్తామని చెప్పినా వినలేదు. దీంతో భయపడిన సాయికుమార్ విషయాన్ని తండ్రికి ఫోన్ చేసి చెప్పి.. కాలేజీ భవనం మూడో అంతస్తు పైనుంచి దూకాడు. గమనించిన కళాశాల సిబ్బంది దవాఖానకు తరలించే లోపే పరిస్థితి విషమించి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.