ఇచ్చోడ, సెప్టెంబర్ 3 : మండలకేంద్రానికి చెందిన ముస్కు రాజేందర్ రెడ్డి రాష్ట్రస్థాయి ఉత్తమ శాస్త్రవేత్తగా శనివారం హైదరాబాద్లో అవార్డును అందుకున్నారు. ముస్కు మంగమ్మ, రాజేశ్వర్ రెడ్డి దంపతుల కుమారుడు రాజేందర్ రెడ్డి వ్యవసాయ పరిశోధనా ఏరువాక కార్యాలయం ఆదిలాబాద్లో శాస్త్రవేత్తగా విధు లు నిర్వహిస్తున్నాడు. కొన్ని నెలలుగా ఆయన సోయా చిక్కుడు పంటపై పరిశోధన చేశాడు. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్శిటీ 8 ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయనకు హైదరాబాద్లో యూనివర్శిటీ ఉప కులపతి రఘునందన్రావ్, ప్రొఫెసర్ బీఎస్ మూర్తి డైరెక్టర్ (ఐటీఐ హైదరాబాద్) చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. తనపై బాధ్యత మరింత పెరిగిందని రాజేందర్ రెడ్డి తెలిపారు. జిల్లా ప్రజలు, వ్యవసాయ ఏరువాక పరిశోధనా సంస్ధ ఆదిలాబాద్ శాస్త్రవేత్తలు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏఆర్ఎస్ శాస్త్రవేత్తకు రాష్ట్రస్థాయి అవార్డు
తాంసి, సెప్టెంబర్ 3: ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డా.ఎం. రాజేందర్రెడ్డికి రాష్ట్ర స్థాయి లో అవార్డు పొందారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొ.బి.యస్. మూర్తి చేతుల మీదుగా శనివారం హైదరాబాద్లో నిర్వహించిన వేడుకల్లో అవార్డు అందుకున్నారు. అలాగే ఫీల్డ్ సూపర్వైజర్ జే సుమిత్కుమార్ కూడా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్నారు. వీరిని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త, ఇన్చార్జి డా.శ్రీధర్చౌహాన్, ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు డా.కే. రాజశేఖర్, డా.డీ.మోహాన్దాస్, డా. అనిల్కుమార్, ఉద్యోగులు, సిబ్బంది అభినందించారు.