మెదక్ మున్సిపాలిటీ, జనవరి 20: నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఛాంపియన్-2023 పోటీలు నేడు, రేపు మెదక్లోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగనున్నాయి. పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 679మంది క్రీడాకారు లు పోటీల్లో పాల్గొంటున్నారు. ఇందు లో 531మంది పురుషులు, 148 మ హిళలు ఉన్నారు. 20 ఈవెంట్లలో 14 గ్రూపులుగా 35 ఏండ్ల పైబడిన వారు పాల్గొనున్నారు. మెదక్ స్టేడియంలో అంతర్జాతీయ స్థాయి క్రీడలకు అనుగుణంగా ప్రమాణాలు పాటిస్తూ మైదానం లో ట్రాక్ నిర్మించగా రెండోసారి రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతున్నాయి. మొదటిసారి 2022 ఆగస్టు 23 నుంచి 25వరకు 8వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఈ ట్రాక్పైనే నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో క్రీడాకారులకు వసతితో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. క్రీడల నిర్వాహణకు అవసరమైన మౌలిక వసతికి చర్యలు తీసుకుంటున్నారు. క్రీడా పోటీలను పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేసేందుకు రెండు రోజులుగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు శ్రమిస్తూ క్రీడా పోటీల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శుక్రవారం సాయంత్రం వరకే పలు జిల్లాల క్రీడాకారులు స్టేడియానికి చేరుకున్నారు.
ప్రారంభించనున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను శనివారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మాస్టార్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, పటాన్చెరు ఎమ్మె ల్యే మహిపాల్రెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి మాస్టార్స్ అథ్లెటిక్స్ అసొసియేషన్ కార్యదర్శి ప్రభుగౌడ్, కోశాధికారి లక్ష్మి హాజరుకానున్నారు.