హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ వెయిట్లిఫ్టింగ్ టోర్నీలో ఏడుగురు రాష్ట్ర ఉద్యోగులు బరిలోకి దిగనున్నారు. ఈనెల 19 నుంచి 25 వరకు ఢిల్లీలో జరుగనున్న పోటీల్లో పాల్గొనేందుకు జీఏడీ కార్యదర్శి శేషాద్రి అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. వేర్వేరు విభాగాల్లో ఖాలీద్ఖాన్(60కి), నేనావత్ జాను, దివాకర్(67కి), యూసుఫ్(73కి), శ్రీనివాస్వర్మ(81కి), ఆనంద్(96కి), ఖలీద్(81కి) పోటీకి దిగనున్నారు. రాష్ట్ర జట్టుకు మేనేజర్గా మోహన్, కోచ్గా రమేశ్కుమార్ వ్యవహరించనున్నారు.