పాలమూరు, జనవరి 4 : చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం కర్టాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని నిమ్హాన్స్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కర్టాటక మహిళా నారీ శక్తి రాష్ట్రస్థాయి సమ్మేళనంలో ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి, విద్యాశాఖ మంత్రి మధు బంగారప్పలతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం వచ్చి సుమారు 80 సంవత్సరాలు గడిచినా మహిళలు నిత్యం అగౌరవం, లైంగిక దాడులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
మహిళా చట్టాలు ఉన్నప్పటికీ వాటిని అమ లు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళపై జరిగే సంఘటనలు, లైంగిక దాడులు, వరకట్న వేధింపులు, తదితర కేసుల్లో ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి 2 నెలల వ్యవధిలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని, కఠినమైన శిక్షలు అమలుపర్చాలని డిమాండ్ చేశారు. జనాభాలో 50శాతం మ హిళలు ఉన్నప్పుడు వారికి 50శాతం రిజర్వేషన్లు ఉండాలని అన్నారు.
కానీ చట్ట సభల్లో 33శాతం మాత్రమే మహిళా రిజర్వేషన్లుతేవడం జరిగిందని దానిని వెంటనే అమలులోకి తెచ్చి మహిళా సాధికారతకు అవసరమైన చట్టాలు తయారు చేసి అమలు చేయాలని పేర్కొన్నారు. అప్పుడే మహిళలు నిజమైన స్వాతంత్రం పొందుతారని అన్నారు. ఇలాంటి మహిళా సమ్మేళనాలు దేశంలోని అన్ని రాష్ర్టాల్లో నిర్వహించి మహిళల్లో చైతన్యం తీసుకరావాలని ఆకాంక్షించారు. ఇలాంటి సమ్మేళనాలు మహిళా సాధికారత, భద్రత, సమాన హక్కులపై చర్చించే వేదికగా నిలిచి, మహిళా శక్తిని బలోపేతం చేసేందుకు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నాగలక్ష్మి, మహిళా అధ్యక్షురాలు అమిత తదితరులు పాల్గొన్నారు.