హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్లో శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్(ఎస్డీఎఫ్సీ) గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం జరిగిన మ్యాచ్లో ఎస్డీఎఫ్సీ 2-0 తేడాతో ఐజ్వాల్ ఎఫ్సీపై అద్భుత విజయం సాధించింది. లీగ్లో ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా గెలుపే లక్ష్యంగా దూసుకెళుతున్న ఎస్డీఎఫ్సీ..ఐజ్వాల్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్లో మొదటి నుంచే రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఎస్డీఎఫ్సీ తరఫున డేవిడ్ మునోజ్ (83ని), చాంగ్టె (90+) గోల్స్ చేశారు. ఐజ్వాల్ పుంజుకునేందుకు ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఈ విజయంతో ప్రస్తుతం 20 పాయింట్లతో ఎస్డీఎఫ్సీ మూడో స్థానంలో కొనసాగుతున్నది. గోకులం కేరళ(24), మొహమ్మదీన్(22) టాప్-2లో ఉన్నాయి. ఎస్డీఎఫ్సీ తమ తదుపరి మ్యాచ్లో ఈనెల 18న రాజస్థాన్ ఎఫ్సీతో తలపడుతుంది.