బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్లో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్.. పురుషుల స్విమ్మింగ్ 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఈవెంట్లో ఫైనల్స్కు ప్రవేశించాడు. సెమీస్లో అతను 54:55 సెకన్లలో ఈవెంట్ను క్లోజ్ చేశాడు. 21 ఏళ్ల స్విమ్మర్ తన హీట్స్లో నాలుగో స్థానంలో నిలిచాడు. మెడల్ ఈవెంట్ కోసం జరిగే ఫైనల్స్లో అతను ఏడో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా స్విమ్మర్ పీటర్ కోట్జ్ 53.67 సెకన్లతో సెమీస్లో మొదటి స్థానంలో నిలిచాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్లో నటరాజ్ తన ఈవెంట్లో 27వ స్థానంలో నిలిచాడు.