రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు పాల్గొన్నారు. ఊరుఊరికో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా విజయదశమి పర్వదినాన విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి జమ్మిచెట్టు నాటారు. కాగా, దసరా పర్వదినాన శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు విజయదుర్గ అవతారంలో దర్శనమిచ్చింది. షడ్భుజి రూపంలో అమ్మవారి అవతారాన్ని అలంకార భట్టర్లు తీర్చిదిద్దారు.