తిరుమల : శ్రీలంక ప్రధాని రాజపక్సే తన రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని శ్రీకృష్ణ విశ్రాంతిగృహం వద్ద ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, కలెక్టర్ ఎం.హరినారాయణన్, సివిఎస్వో గోపినాథ్ జెట్టి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
శ్రీలంక ప్రధాని వెంట సతీమణి షిరాంతి రాజపక్సేఉన్నారు. శుక్రవారం ఉదయం ప్రధాని దంపతులు శ్రీవారిని దర్శించుకోనున్నారు.