దుబాయ్: వరుస విజయాలతో జోరు కనబర్చిన పాకిస్థాన్, శ్రీలంక మధ్య ఆదివారం ఆసియాకప్ ఫైనల్ జరుగనుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమ్ఇండియా.. సూపర్-4 దశలోనే వెనుదిరగగా.. లంక, పాక్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీ లంకలో జరుగాల్సి ఉన్నా.. ఆర్థిక సంక్షోభం కారణంగా యూఏఈకి తరలించిన విషయం తెలిసిందే. భారత్, పాక్ మధ్య ఫైనల్ జరుగుతుందని అభిమానులు ఊహించినా.. అద్వితీయ ఆటతీరు కనబర్చిన శ్రీలంక ఫైనల్కు దూసుకొచ్చింది. సూపర్-4 దశలో పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగిన చివరి పోరులో లంకేయులను విజయం వరించగా.. ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని పాకిస్థాన్ భావిస్తున్నది.