పుణె: ఐపీఎల్ పదిహేనో సీజన్ను ఓటమితో ఆరంభించిన సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్కు ఐపీఎల్ పాలక మండలి రూ.12 లక్షల జరిమానా విధించింది. ‘ఈనెల 29న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో జరిమానా విధించాం’ అని ఐపీఎల్ తెలిపింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ 61 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. రైజర్స్ తమ తర్వాతి మ్యాచ్లో ఏప్రిల్ 4న లక్నోతో తలపడుతుంది.