హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ, రాష్ట్ర స్థాయిలో సత్తా చాటుతున్న క్రీడాకారులకు తమ విద్యాసంస్థలో ప్రతి ఏటా రూ.1.40 కోట్ల విలువైన ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కార్యదర్శి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. తమ కళాశాలలో స్పోర్ట్స్ కోటాలో 72 సీట్లు కేటాయిస్తున్నామని, అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాల ప్రాంగణంలో శనివారం 5వ స్పోర్ట్స్ స్కాలర్షిప్ల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రావు, జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్, ఎంఎల్ఆర్ఐటీ ఛైర్మన్ మర్రి లక్ష్మణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.